శివుడి అంశతో పుట్టిన ఆంజనేయడు రామ భక్తుడుగా ఎలా మారాడు?

-

విష్ణువు, శివుడు శరీరాలు వేరైన హృదయం ఒకటే కావడం విశేషం.శివుడు రామ భక్తుడు. పార్వతీ దేవికి ‘శ్రీరామ రామ రామేతి, రమే రామే మనోరమే ‘ సహస్ర నామ తత్తుల్యం, రామనావరాననే అని రామ తత్త్వాన్ని శివుడే స్వయంగా చెప్పాడు..కాశీలో మరణించిన ప్రాణుల కుడి చెవిలో విశ్వేశ్వరుడు రామ తారక మంత్రం చెబుతాడట ఈ విషయం పై పురాణాలు కథలు కథలుగా చెబుతున్నాయి.

హనుమత్సంహితలో శంకరుడే రామ సేవా కాంక్షతో హనుమంతునిగా జన్మించాడని చెప్పబడింది. పార్వతీ దేవితో శివుడు ‘దేవీ..రావణుడు తన పది తలలు కోసి అగ్నిలో వేసి, దశ రుద్రుల కరుణకు పాత్రుడు అయ్యాడు. ఏకాదశ రుద్రుని ఉపేక్షించి నాడు. నా అంతరంగిక భక్తుడైన నందీశ్వరుని రావణుడు హేళన చేశాడు. కావున రావణుని శిక్షించడానికి ఏకాదశ రుద్రాంశతో నేనే రామ భక్తుడైన హనుమంతునిగా పుట్టి రావణుని శిక్షించెదను.

నన్ను అవమానించినా భరిస్తాను గాని, నా భక్తుని అవమానిస్తే భరించలేనని శంకరుడే హనుమతుండి రూపంలో జన్మించాడు. అకార ఉకార మకరాలు కలిస్తే ఓంకారం అనే ప్రణవం ఏర్పడుతుంది.అకారో విష్ణు’ అని చెప్పబడింది. శ్రీకృష్ణుడు ‘అక్షరాణాం’ ‘అ’ కారోస్మి అన్నారు. అంటే ‘అ’ విష్ణు బీజం. ‘మకా రాక్షరసంభూతఃశివస్తు హనుమాన్ స్మృతః’ అని తారసారోప ఉప నిషత్తు చెబుతుంది. కనుక శివ విష్ణువులు ఇద్దరు ఓంకార స్వరూపులే అని అర్థం చేసుకోవాలి. తనను తాను ఎలాగు దైవంగా భావించలేడు..మహా విష్ణువు రూపంలో ఉన్న రాముడుకు, శివుడు భక్తుడుగా మారాడని పురాణాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news