వాస్తు: పసుపుతో ఇలా చేస్తే.. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తెలుసా..?

-

వంటగదిలో ఉండే పసుపు లక్ష్మీదేవితో సమానం. ఆయుర్వేదంలో పసుపును దివ్యఔషధంగా పరిగణిస్తారు. పూజల్లో పసుపు కచ్చితంగా కావాలి. పసుపు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. పసుపుతో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. సౌందర్యానికి ,సౌభాగ్యానికి చిహ్నంగా భావించే పసుపు ఐశ్వర్యానికి కూడా చిహ్నం అని మీకు తెలుసా? ఇంట్లో ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి పసుపుతో కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.. ఇక లైఫ్‌లో దేనికి కొరత ఉండదు. వాస్తు ప్రకారం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే.. పసుపుతో ఏం చేయొచ్చో తెలుసుకుందామా..!

అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రంలో పసుపు ముద్దను మూట కట్టి లాకర్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మన లైఫ్ లో అనవసరపు ఖర్చులు చాలా వరకు తగ్గుతాయట. అయితే పసుపు ముద్ద తడిగా ఉన్నప్పుడు లాకర్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ముందుగా పసుపు ముద్దను ఎర్రగుడ్డలో పెట్టి పూజా మందిరంలో ఉంచండి.. పసుపు ముద్ద బాగా గట్టిపడిన తర్వాత వస్త్రానికి ముడివేసి లాకర్లో పెట్టుకోండి. లేకపోతే లాకర్ లోపల బూజు పడుతుంది. ఈ పసుపు ముద్దను లాకర్ యొక్క ఈశాన్య దిశలో ఉంచాలి.

ఇలా పసుపు ముద్ద లాకర్లో ఉంచినప్పుడు నర దిష్టి చాలా వరకు తగ్గుతుంది. మీరు సంపాదించే మార్గాలు కూడా ఎక్కువవుతాయి. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత పసుపు నీటిని ఇల్లంతా చిలకరించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగడమే కాక ఇంటికి నర దిష్టి ఉండదు. తరచూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు ప్రతిరోజు పూజకి ముందు పసుపు నీళ్లు ఇల్లంతా చల్లుకోవడం ఎంతో మంచిది. అలాగే శుక్రవారం పూట వీలైనంత వరకు పసుపు బట్టలను ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

వీటిపై నమ్మకం లేనివాళ్లు లైట్‌ తీసుకోవచ్చు. కానీ ఎవరైతే వాస్తు, శాస్త్రాలను నమ్ముతారు వాళ్లు నిండుమనసుతో వీటిని అనుసరిస్తే.. మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు కచ్చితంగా ఉంటుందని పండితులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news