భారత దేశం లో చూడాల్సిన ప్రముఖ గణపతి ఆలయాలు..!

-

మన భారత దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు మనం వినాయకుడుని పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలి అంటే ముందు మన విఘ్నేశ్వరుడిని పూజించాలి. ఏ కార్యంలో అయినా సరే తొలి పూజలందుకుంటాడు వినాయకుడు. అయితే భారత దేశంలో ప్రసిద్ధి చెందిన వినాయక ఆలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

కాణిపాక వినాయక ఆలయం, చిత్తూరు:

వేల సంవత్సరాల కాలం నాటిది ఈ ఆలయం. చిత్తూరు జిల్లా కాణిపాకం లో ఈ ఆలయం ఉంది. చోళులు రాజు ఈ గణపతి ఆలయాన్ని కట్టారు అయితే రోజు రోజుకి ఇక్కడ ఉండే వినాయకుడి విగ్రహం పెరుగుతూ వస్తుంది. అలానే ఇక్కడ వున్న వినాయకుడు స్వయంభూగా వెలిశారు.

సిద్ధి వినాయక ఆలయం, ముంబై:

ఇది కూడా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆలయం. ఇక్కడ వినాయకుడిని నవ సత్య గణపతి అంటారు. ఈ ఆలయం 1801లో నిర్మించారు. ఎంతో ఆకర్షణీయంగా ఈ దేవాలయం ఉంటుంది. అవకాశం వస్తే తప్పక ఈ ఆలయాన్ని సందర్శించండి.

పూణే గణపతి ఆలయం:

ఇక్కడ వినాయకుడు 7.5 అడుగుల ఎత్తులో ఉంటారు. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కూడా పురాతన కాలం నాటిది.

విజ్ఞహర్ ఆలయం, Ozar:

పూణే కి 85 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా నిర్మించారు.

గణపతిపూలే ఆలయం రత్నగిరి:

ముంబై కి 350 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ప్రసిద్ధి చెందిన గణపతి ఆలయాల్లో ఇది ఒకటి.  ఈ ఆలయం కూడా తప్పక చూడాల్సిందే.

తిరుచిరాపల్లి వినాయక ఆలయం:

త్రిచి లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం కొండమీద ఉంటుంది. ఇక్కడికి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. కావేరి నది ఇక్కడ ఉంటుంది. నిజంగా ఈ ఆలయం వ్యూ చాలా సుందరంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news