బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో వింత.. అమ్మ మహిమేనా..?

-

బల్కంపేట ఎల్లమ్మ.. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ అమ్మవారి ఆలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి చాలా మహిమ ఉందని చెబుతారు. దేశంలోనే పెద్ద ధనవంతుడైన ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ హైదరాబాద్ వస్తే తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్లరు. ఈ అమ్మను దర్శించుకోవడానికైనా సరే ఆమె ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తారు.

అంతటి ప్రత్యేకత ఉందీ బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి.. అలాంటి ఆలయంలో తాజాగా ఓ వింత జరిగిందట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లమ్మ ఆలయంలో ఓ బావి ఉంది. బల్కంపేట ఎల్లమ్మ దేవస్థానంలో అమ్మవారు వెలిసిన బావిలోంచి శనివారం నీళ్లు ఉబికి బయటకు వచ్చాయట.

గర్భగుడి, అమ్మవారి మూలవిరాట్ కూడా నీటితో నిండాయట. అమ్మవారి మూలవిరాట్ ను దర్శనం చేసుకొని బయటకు వచ్చే మార్గం మొత్తం నీటితో నిండిపోయింది. దీంతో కొందరు భక్తులు నీటిని సీసాల్లో నింపుకొన్నారు. ఈ నీటిని కలుపుకొని స్నానం చేస్తే వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్ముతున్నారు.

బావి నుంచి నీళ్లుపైకి రావడం చాలా ఏళ్ల తర్వాత జరిగిందని అర్చకులు చెబుతున్నారు. బల్కంపేట అమ్మవారి ఉత్సవాలు కూడా చాలా వేడుకగా జరుగుతాయి. హైదరాబాద్ నగరం అంతగా అభివృద్ధి చెందని రోజుల్లో కూడా హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి భక్తులు ఎడ్లబళ్లు కట్టుకుని వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకునేవారు.

Read more RELATED
Recommended to you

Latest news