Medak: కత్తులతో దాడి చేసిన వ్యక్తుల అరెస్ట్

-

సదాశివపేట పట్టణంలో నిన్న రాత్రి గుండె ఉదయ్ అనే వ్యక్తి మీద కత్తులతో దాడి చేసిన యుసూప్, అక్రమ్ అనే ఇద్దరిని సదాశివపేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ బాలాజీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పాత సంఘటనను మనసులో పెట్టుకుని కత్తులతో తొమ్మిది సార్లు దాడి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో సీఐ సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news