Medak: పెట్రోల్ బంకులో మోసం.. 4 లీటర్ల పెట్రోల్ రూ.550..

-

కొల్చారం మండల పరిధిలోని రంగంపేటకు చెందిన ప్రవీణ్ గురువారం NH పక్కన గల వినాయక ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లి రూ. 550 ఇచ్చి పెట్రోల్ పోయించుకున్నాడు. పెట్రోల్ పంపు 5 లీటర్లు చూపించగా సదరు వ్యక్తికి అనుమానం కలిగింది. దీంతో బైక్‌లోని పెట్రోల్ మొత్తం బయటకి తీసి చూడగా.. కేవలం 4లీటర్లు మాత్రమే రావడంతో ఖంగుతిని, సిబ్బందిని నిలదీశాడు. దీనిపై జిల్లా సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news