మహబూబాబాద్ జిల్లా: ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

-

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని కాచనపల్లి గ్రామానికి చెందిన మమత అనే మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. సోమవారం పురిటినొప్పులతో జిల్లా ఏరియా ఆస్పత్రిలో చేరగా ఆపరేషన్ చేయగా ఒక ఆడపిల్ల, ఇద్దరు మగ శిశువులకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనివ్వడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Read more RELATED
Recommended to you

Latest news