మెదక్ : కల్హేర్‌లో మళ్ళీ చిరుతపులి కలకలం..!

-

కల్హేర్ మండల పరిధిలోని రాపర్తి శివారులో నల్లరాళ్ల బండ ప్రదేశం వద్ద చిరుత పులి పశువులపై దాడి చేస్తుంది. గ్రామానికి చెందిన నారాయణ అనే రైతు ఆవును చిరుత పులి చంపేసింది. ఘటనా స్థలాన్ని అటవి శాఖ అధికారులు శుక్రవారం సాయంత్రం సందర్శించారు. ఆవు కళేబరానికి అక్కడే పోస్టుమార్టం చేయించారు. కల్హెర్, సిర్గాపూర్ మండలాల్లో చిరుత సంచరిస్తుందని, మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అటవీశాఖ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news