Rangareddy: ఆన్‌లైన్‌లో మట్కా.. అరెస్ట్ చేసిన పోలీసులు

-

ఆన్‌లైన్‌లో మట్కా నిర్వహిస్తున్న ఇద్దరిని ఎఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి నగర్‌కు చెందిన సంతోష్ కుమార్, వినోద్ కుమార్ గత కొంత కాలంగా వాట్సాప్ గ్రూపు తయారు చేసి మట్కా నిర్వహిస్తూ పేటీఎం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. మంగళవారం మట్కా ఆడుతున్న ఇంటిపై దాడి చేసి రూ. 5220 నగదు, మట్కా చిట్టీలు స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.

Read more RELATED
Recommended to you

Latest news