గిరిజన విద్యార్థులకు శుభవార్త.. 50 వేల రూపాయల గ్రాంట్

-

మీరు గిరిజన విద్యార్థులా? ఏవైనా వృత్తి విద్యా కోర్సులు చదువుతున్నారా? అయితే.. మీరు గ్రాంట్ పొందేందుకు అర్హులు. అవును.. 50 వేల రూపాయల గ్రాంట్‌ను మీరు పొందొచ్చు. వృత్తి విద్యా కోర్సులయినటువంటి మెడిసిన్, ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ లాంటి ఏ కోర్సు చేస్తున్నా సరే.. ఈ గ్రాంట్‌కు అర్హులు అవుతారు.

కానీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్కాలర్ షిప్‌లను పొందకూడదు. అంటే.. వాటిని పొందని వారికే ఈ గ్రాంట్‌ను అందిస్తారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ గ్రాంట్ లభిస్తుంది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ వివరాలు వెల్లడించింది. మిగితా వివరాలకు గానీ… దరఖాస్తు పెట్టడానికి గానీ.. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లో ఉన్న గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version