గుడ్ న్యూస్.. బీటెక్​తో ఇండియన్​ ఆర్మీలో జాబ్స్​!

-

ఇంజినీరింగ్​ గ్రాడ్యుయేట్స్​కు శుభవార్త. ఇండియన్​ ఆర్మీ 196 టెక్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు జులై 19లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • ఎస్ఎస్​సీ (టెక్​) – 175 పోస్టులు
  • ఎస్​ఎస్​సీడబ్లూ (టెక్​)​ – 19 పోస్టులు
  • ఎస్​ఎస్​సీడబ్ల్యూ టెక్​ & నాన్​ టెక్ – 02 పోస్టులు​

విద్యార్హతలు

  • అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంజినీరింగ్​ ఫైనల్ ఇయర్​ చదువుతున్నవారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • SSCW (నాన్ టెక్​) (నాన్ యూపీఎస్​సీ) పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • SSCW (టెక్​) పోస్టులకు ఏదైనా ఇంజినీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్​ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి

  • అభ్యర్థుల వయస్సు 2024 ఏప్రిల్​ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఎంపిక ప్రక్రియ

  • అభ్యర్థులను వారి గ్రాడ్యుయేషన్​ లేదా బీటెక్​ మార్కుల మెరిట్​ ఆధారంగా వడపోస్తారు. తరువాత వీరికి 2 దశల్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. మొదటి దశలో ఉత్తీర్ణులైన వారిని, 2 దశ ఇంటర్వ్యూకు తీసుకుంటారు. ఇందులో కూడా ఉత్తీర్ణలైనవారికి.. వైద్య పరీక్షలను నిర్వహించి, శిక్షణకు తీసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news