డిప్లొమా ఉద్యోగాలు.. జీతం నెలకు రూ.40 వేలు

-

విశాఖ రిఫైనరీలో 72 టెక్నీషియన్లు

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) విశాఖ రిఫైనరీలో టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు:  టెక్నీషియన్‌
విభాగాల వారీగా ఖాళీలు: ఆపరేషన్స్‌ టెక్నీషియన్‌-66, బాయిలర్‌ టెక్నీషియన్‌-6 ఉన్నాయి.
అర్హతలు: ఆపరేషన్‌ టెక్నీషియన్‌కు డిప్లొమా ఇన్‌ కెమికల్‌ ఇంజినీరింగ్‌, బాయిలర్‌ టెక్నీషియన్‌ పోస్టుకు ప్రథమశ్రేణిలో బాయిలర్‌ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌ ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయస్సు: 2019, నవంబర్‌ 11 నాటికి 18-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా
పరీక్ష కేంద్రాలు: ముంబై, విశాఖపట్నం, కోల్‌కతా, చెన్నై, ఢిల్లీ.
జీతం: నెలకు రూ.40,000/- (కనీసం)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: డిసెంబర్‌ 21
వెబ్‌సైట్‌: https://hindustanpetroleum.com

 

 

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news