ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 365 రోజులకు పెయిడ్ లీవ్స్ కు గ్రీన్ సిగ్నల్..

-

ఉద్యోగుల సంక్షేమం, భద్రత కోసం పలు సంస్థలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఉద్యోగుల శ్రేయస్సు కోసం మరిన్ని వెసులుబాటులు కల్పిస్తున్నాయి.ఇప్పటికే పలు సంస్థలు ప్రత్యేక ఫాకెజీలను అందిస్తున్నారు. తాజాగా -కామర్స్ సంస్థ మీషో మరో అడుగు ముందుకేసింది. తమ సంస్థ ఉద్యోగులకు వేతనంతో కూడిన365 రోజులు లీవ్ ఇచ్చేందుకు నిర్ణయించుకుంది.

ఉద్యోగుల భద్రత, సంక్షేమమే లక్ష్యంగా ‘మీకేర్‌ అనే కార్యక్రమానికి మీషో శ్రీకారం చుట్టింది. అన్‌లిమిటెడ్‌ లీవ్‌ పాలసీ ద్వారా ఉద్యోగులు గరిష్ఠంగా 365 రోజుల వరకు సెలవు తీసుకునేలా నిబంధనలు రూపొందించింది. అంతేకాకుండా ఆ సెలవు కాలంలోనూ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయించింది. సంస్థలో పని చేస్తున్న ఉద్యోగి లేదా వారి కుటుంబంలోని ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురై.. తరచూ చికిత్స అవసరమైన వారి విషయంలో ఈ లీవ్స్ ఇవ్వనున్నారు. అంతే కాకుండా వ్యక్తిగత లక్ష్యాలను సాధించుకునేందుకూ ఈ లీవ్స్ ను ఉపయోగించుకునేలా సవరణలు చేసినట్లు తెలుస్తుంది.

సంస్థలో పని చేసే ఉద్యోగి అనారోగ్యానికి గురైతే సెలవు కాలం మొత్తానికి డబ్బులు చెల్లిస్తారు. అయితే ఉద్యోగి ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురై.. వారి కోసం సెలవు పెట్టాల్సిన అవసరం వస్తే మూడు నెలల వరకు 25 శాతం వేతనం అందజేస్తారు. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీలో 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఈ కంపెనీ విలువ 1 బిలియన్‌ డాలర్లకు చేరడంతో యూనికార్న్‌ల జాబితాలో చేరింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు సంస్థ పట్ల మంచి అభిప్రాయం ఉండటంతో పాటు, సంస్థ కోసం పని చేస్తారని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news