నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,035 ఉద్యోగాల భర్తీకి సర్కార్ సిద్ధం..!

-

నిరుద్యోగులకు శుభవార్త. సీఎం కేసీఆర్ సర్కార్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో నిరుద్యోగులకు బెనిఫిట్ కలుగనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలతో కలిపి మొత్తం 3,035 మందిని నియమించనున్నారు.

నిరుద్యోగులకు

మహబూబాబాద్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, కొత్తగూడెం, మంచిర్యాలలో మొత్తం ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, మిగతా ప్రాంతాల్లో 13 నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేయాడం జరిగింది. అయితే ఈ కాలేజీల్లో ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో 2,135 మందికి ఉద్యోగాలని.. నర్సింగ్ కాలేజీల్లో 900 మందిని నియమించాలని ఆర్థికశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇలా ఉంటే ఏడు మెడికల్ కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 305 చొప్పున మొత్తం 2,135 మందిని నియమించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేయనున్న 13 నర్సింగ్ కాలేజీలతో పాటు, ప్రస్తుతం ఉన్న మరో రెండు కాలేజీల్లో 60 మంది చొప్పున మొత్తం 900 నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలతో కలిపి మొత్తం 3,035 మందిని నియమించనున్నారు. అయితే ఇవి మాత్రం ఔట్ సోర్సింగ్ విధానంలో చేపట్టనున్నారు. నూతనంగా నియామకమైన వారి సేవలను 2022 మార్చి చివరి వరకు వినియోగించుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news