తెలంగాణ ఎంసెట్ పరీక్షలకు ప్రీపెర్ అవుతున్నారా? ఇది ఒకసారి చూడండి..

-

ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. మరి కొద్ది రోజుల్లో పరీక్షలు ముగియగానే మళ్ళీ ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి.తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.ఈ పరీక్షను జేఎన్‌టీయూ (హైదరాబాద్‌) నిర్వహిస్తుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అభ్యర్థులు మ్యాథమెటిక్స్‌, కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయోలజీ సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ చేసి ఉండాలి/ ఆప్షనల్, ఒకేషనల్ కోర్సుల ఉత్తీర్ణత / డిప్లమా చివరి సంవత్సరం చదువతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏప్రిల్ 6 వ తేదీ నుంచి 28 మే తేదీ ఆఖరి తేదీ..అప్పటి వరకూ అప్లై చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించిన అనంతరం అగ్రికల్చర్, మెడికల్ పరీక్షను జూలై 14, 15వ తేదీల్లో, ఇంజినీరింగ్ పరీక్షను జూలై 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఎంసెంట్ దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 400, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 800 చెల్లించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇంజినీరింగ్, మెడికల్ ప్రవేశ పరీక్ష రాసే ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ. 800, మిగతా కేటగిరిల అభ్యర్థులు రూ. 1600 చెల్లించి, ఎంసెట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు..

తెలంగాణ ఎంసెట్ 2022లో ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలు అని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇంటర్ వెయిటేజీకి సైతం ఎంసెట్ ర్యాంకులలో ప్రాధాన్యం ఇచ్చేవారు. ఈ సారి ఎంసెట్ ర్యాంకులు కేటాయించడానికి ఇంటర్ పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది.కరోనా కారణంగా సరిగ్గా చదవని వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.ఇకపోతే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్‌లో 45 శాతం, ఇతర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు తప్పనిసరి ఉండాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు మినిమం మార్కులతో ఇంటర్ పాస్ అయితే చాలు అని గుడ్ న్యూస్ చెప్పారు. మరోవైపు ఎంసెట్ ర్యాంకులలో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది..ఈ వార్త అందరికి గుడ్ న్యూస్ అని చెప్పాలి.. ఎంసెట్ కు ప్రిపేర్ అవ్వాలి..

 

Read more RELATED
Recommended to you

Latest news