బిగ్‌బాస్‌లో బిగ్ ట్విస్ట్‌: ఈ వారం ఆ ఇద్ద‌రు ఎలిమినేట్‌..!

-

తెలుగు బుల్లితెర బిగ్‌బాస్ సీజ‌న్ 3 ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డుతోంది. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎన్ని టాస్క్‌లు ఇస్తున్నా.. ఇప్ప‌టికే ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ల‌ను ప్ర‌వేశ‌పెట్టినా అవ‌న్నీ తుస్సుమంటున్నాయి. వచ్చిన ఇద్ద‌రు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్లు శిల్పా చ‌క్ర‌వ‌ర్తి, త‌మ‌న్నా సింహాద్రి ఇద్ద‌రు ఆక‌ట్టుకోలేక‌పోయారు.

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చిన టాస్క్‌లు మ‌రీ అంత గొప్ప‌గా లేవు. ఇక ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ ప్రీ క్లైమాక్స్ ద‌శ‌కు చేరుకుంటోన్న వేళ కాస్త ర‌క్తిక‌డుతోంది. ఇక ఈ వారం ఎల‌మినేష‌న్ జోన్‌లో మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఇప్ప‌టికే వ‌రుణ్ సందేశ్ సేఫ్ అయిన‌ట్టు బిగ్‌బాస్ ప్ర‌క‌టించారు. ఇక మిగిలిన వారిలో కెప్టెన్ శ్రీముఖితో పాటు బాబా భాస్క‌ర్‌, ర‌వికృష్ణ ఉన్నారు. వీరిలో ర‌వికృష్ణ ఎలిమినేష‌న్ అవుతాడ‌ని ఎక్కువ మంది అంచ‌నా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే బిగ్‌బాస్ ఈ వారం అదిరిపోయే ట్విస్ట్ ఇస్తున్నాడ‌ని తెలుస్తోంది. ఈ వారం ర‌వికృష్ణ‌తో పాటు బాబా భాస్క‌ర్ కూడా ఎల‌మినేట్ అవుతాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ షోలు చూసుకుంటే ఫైనల్ వారం ఐదుగురు మాత్రమే హౌస్‌లో ఉంటారు. ఆ లెక్కన చూసుకుంటే ఆఖరి వారంలో ఐదుగురు మిగలాలంటే ఇంకా ఐదుగురు ఎలిమినేట్ కావాలి. వారానికి ఒక‌రు బ‌య‌ట‌కు వెళ్లినా ఫైనల్స్‌లో ఆరుగురు ఉంటారు. అందుకే ఈ వారం ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపిస్తాడ‌ని అంటున్నారు.

బ‌య‌ట‌కు వెళ్లిన ఆలీ తిరిగి వ‌చ్చాడు. వాస్త‌వానికి ఒక వారం ఇద్ద‌రిని బ‌య‌ట‌కు పంపే ప్ర‌క్రియ గతవారమే మొదలుపెట్టి రాహుల్‌ను ఎలిమినేట్ చేశారు. మళ్లీ తూచ్ అని అతన్ని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ఆ తరవాత అలీ రెజాను కూడా హౌస్‌లోకి పంపారు. దీంతో ఈ వారం డ‌బుల్ ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని అంటున్నారు. బలమైన ఇద్దరు కంటెస్టెంట్లు ఒకేసారి ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నారనే వార్త కచ్చితంగా బిగ్ బాస్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చూద్దాం ఈ రాత్రి ఏం జరగబోతోందో..!

Read more RELATED
Recommended to you

Latest news