టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుకు కరోనా

-

ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన టిడిపి నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ ‌ను హైకోర్టు గత నెలలో కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అలా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది.

atchannaidu
atchannaidu

గుంటూర్ రమేష్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడుకు నిన్న ఉదయం నుంచి జలుబు చేయటంతో ఆయనకు ముందస్తు జాగ్రత్తతో ఆసుపత్రి వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. ఈ రోజు వచ్చిన రిపోర్ట్ లో ఆయనకు పాజిటివ్ అని తేలడంతో ఏపీ రాష్ట్ర హైకోర్ట్ కు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది ప్రైవేటు హాస్పిటల్ లో కాబట్టి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై ప్రతివారం హైకోర్ట్ కు బులెటిన్ పంపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news