రేపు కరోనా పై సీఎంలతో మోడీ సమీక్ష

-

కరోనా కేసులు రోజు రోజుకీ భయంకరంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు నమోదు కావడం మొదలయిన కొత్తలో ఇండియా మొత్తం మీద నమోదయిన కేసులు ఇప్పుడు ఒక్కో రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. లాక్ డౌన్ లేకుండా సడలింపులు ఇవ్వడమే దానికి కారణమని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే రేపు ఉదయం 11 గంటలకు 10 రాష్ట్రాలలో కోవిడ్-19 పరిస్థితి మీద ప్రధాని మోడీ సమీక్ష జరపనున్నట్టు చెబుతున్నారు.

pm modi
pm modi

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమీక్షలో ప్రధానితో పాటు రక్షణ, ఆర్ధిక, ఆరోగ్యమంత్రులు అలానే హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిలు కూడా పాల్గొన నున్నారు. రేపు ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మహరాష్ట్ర, బీహార్, గుజరాత్, పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులతో ఈ సమీక్ష జరగనున్నట్టు చెబుతున్నారు. మళ్ళీ లాక్ డౌన్ లాంటి నిర్ణయాలు ఇక ఉండవని మోడీ గతంలోనే క్లారిటీ ఇచ్చిన నేపధ్యంలో రేపటి సమీక్షలో ఏమి నిర్ణయం తీసుకోనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news