దేశంలోకి ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ ఎంట్రీ.. ఆ నాలుగు రాష్ట్రాల్లో కేసులు

-

దేశంలో ఓవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ రోజుకో రకంగా రూపాంతరం చెందుతూ ప్రజల్ని భయపెడుతోంది. తాజాగా ప్రమాదకరమైన వేరియంట్ పుట్టుకొచ్చింది. దీని తొలి కేసు చైనాలోని మంగోలియా ప్రాంతంలో బయటపడింది. ఇప్పుడు ఈ వేరియంట్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. BA.2.75, BJ.1 రకాలు కలిసి XBBసబ్‌ వేరియంట్‌గా ఏర్పడినట్లు వైద్య నిపుణులు వెల్లడించారు. దీనిని ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్‌, ఒడిశా, తమిళనాడులో గుర్తించారు.

ఆగస్టులోనే సింగపూర్, యూఎస్‌లో ఇది వెలుగులోకి వచ్చింది. దీనికి BA.2.75 కంటే వేగంగా వ్యాప్తి చెందే లక్షణం, రోగనిరోధక శక్తిని ఏమార్చే గుణం ఉందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. XBBతో పాటుగా  మొదటిసారి మహారాష్ట్రలో BA.2.3.20, BQ.1 రకాలను కూడా గుర్తించారు. ఇక ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కేసుల పెరుగుదల జన సాంద్రత ఎక్కువగా ఉన్న ఠాణె, రాయ్‌గఢ్‌, ముంబయిలో కనిపించింది.

ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్ XBB వైద్య వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో గత వారంతో పోల్చుకుంటే కొత్త కేసులు 17.7 శాతం మేర పెరిగాయి. అందుకు XBB ఉప రకాన్నే కారణంగా ప్రస్తావిస్తున్నారు. చలికాలం, పండగల సీజన్ ఉండడంతో ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news