క‌రోనాపై పోరాటానికి ‘హిట్‌’మ్యాన్ రోహిత్ శ‌ర్మ విరాళం..!

-

క‌రోనా వైర‌స్‌పై పోరాటం చేసేందుకు దేశ ప్ర‌ధాని మోదీ పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించి.. దానికి అంద‌రూ విరాళాలు పంపాల‌ని కోరుతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే అనేక మంది ప్ర‌ముఖులు పెద్ద ఎత్తున విరాళాల‌ను అంద‌జేశారు. ఇక ప్ర‌ముఖ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా కరోనాపై పోర‌టానికి త‌న వంతు స‌హాయం చేశాడు. రూ.80 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇస్తున్న‌ట్లు అత‌ను ప్ర‌క‌టించాడు.

rohith sharma announce rs 80 lakhs donation to fight with corona virus

క‌రోనాపై పోరాటానికి రూ.80 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇస్తున్నాన‌ని రోహిత్ శ‌ర్మ తెలిపాడు. ఈ మేర‌కు రోహిత్ మంగ‌ళ‌వారం ట్వీట్ చేశాడు. స‌ద‌రు మొత్తం నుంచి రూ.45 ల‌క్ష‌ల‌ను పీఎం కేర్స్ ఫండ్‌కు, రూ.25 ల‌క్ష‌ల‌ను మ‌హారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు, రూ.5 ల‌క్ష‌ల‌ను ఫీడింగ్ ఇండియా స్వ‌చ్ఛంద సంస్థ‌కు, రూ.5 ల‌క్ష‌ల‌ను వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌కు అందిస్తున్న‌ట్లు రోహిత్ శ‌ర్మ తెలిపాడు.

కాగా ఇప్ప‌టికే బీసీసీఐ క‌రోనాపై పోరాటానికి రూ.51 కోట్లు ప్ర‌క‌టించ‌గా, స‌చిన్ టెండుల్క‌ర్‌, సౌర‌వ్ గంగూలీలు త‌లో రూ.50 ల‌క్ష‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. అలాగే గౌతం గంభీర్ రూ.50 ల‌క్ష‌లు, సురేష్ రైనా రూ.52 ల‌క్ష‌ల‌ను పీఎం కేర్స్‌కు విరాళంగా ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Latest news