2024లో కూడా గెలిచేది బీజేపీనే: ప్రధాని మోదీ

-

యూపీ ఎన్నికల ఫలితాలు 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ఫిక్స్ చేశాయని… 2024లో బీజేపీనే గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల అంతాన్ని ఏదో ఒక రోజు చూస్తామని మోదీ అన్నారు. సంక్లిష్ట సమయంలో కూడా కొంత మంది దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలను లూటీ చేసుకుని జేబులు నింపుకునే వారికి 2014లోనే ముగింపు పడిందని ఆయన అన్నారు. వేలకోట్లు లూటీ చేస్తారు విచారణ సాగనివ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేదలకు ఇల్లు, రేషన్, వ్యాక్సిన్ అందించడమే తమ లక్ష్యం అని అన్నారు. కొందరికి దేశ న్యాయ వ్యవస్థపై కూడా నమ్మకం లేదని ఆయన విమర్శించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రపంచం అభినందించిందని ఆయన అన్నారు. ప్రపంచానికి మనం వ్యాక్సిన్లు అందించామని అన్నారు. కొన్ని దేశాలు యుద్ధం చేస్తున్నాయని.. దీని వల్ల ఆయిల్ ధరలు, ముడిచమురు ధర పెరుగుతుందని మోదీ అన్నారు. మనం మాత్రం శాంతి వైపే ఉన్నామని మోదీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news