తాగిన మైకంలో బతికున్న పామును మింగి ప్రాణాలు పోగొట్టుకున్నాడు!

-

తాగిన మత్తులో ఎవరు ఏం చేస్తారో తెలియదంటారు కదా. ఇది కూడా అంతే. ఓ వ్యక్తి తాగిన మైకంలో ఓ పాము పిల్లతో ఆటలాడి చివరకు దాని వల్లే ప్రాణాలొదిలాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకున్నది.

అమ్రోహా జిల్లాకు చెందిన మహిపాల్ సింగ్ వయసు 40 ఏళ్లు. మద్యానికి బానిస. ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉంటాడు. ఓరోజు ఫుల్లుగా మద్యం సేవించి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు మీద ఓ పాము పిల్ల కనిపించింది. దీంతో దాన్ని పట్టుకొని కాసేపు దాంతో ఆటలాడాడు.

ఆసమయంలో అటుగా వెళ్తున్న కొంతమంది అతడి ఆటలు చూసి వీడియో తీయడం ప్రారంభించారు. వాళ్లు మహిపాల్ ను రెచ్చగొడుతూ పామును నోట్లో వేసుకో అంటూ ఆటపట్టించారు. దీంతో మత్తులో ఉన్న మహిపాల్ కు ఏం అర్థం కాక దాన్ని తల మీద పెట్టుకున్నాడు. నోరు తెరిచాడు. దీంతో అది అతడి నోట్లోకి దూరిపోయింది. తర్వాత అది బయటికి రాకుండా కడుపులోకి వెళ్లిపోయింది. అనంతరం అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయాడు మహిపాల్. ఇంటికి వెళ్లగానే కడుపులో తిప్పినట్టు అయి పడిపోయాడు మహిపాల్. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. పామును మింగిన 4 గంటల్లోనే మహిపాల్ కన్నుమూశాడు.

ఇక.. మహిపాల్ పాముతో ఆటలాడుతుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాముతో ఆటలాడి దాన్ని మింగి ఉత్తి పుణ్యానికి ప్రాణాలు పొగొట్టుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news