ట్రక్కుకు ఢీకొని గాల్లో పల్టీలు కొట్టి.. వీడియో

-

రంగారెడ్డి జిల్లాలో విచిత్రమైన యాక్సిడెంట్ చోటు చేసుకున్నది. ఓ వ్యక్తి బైక్ మీద రాంగ్ రూట్‌లో వెళ్తూ నేరుగా ట్రక్కును ఢీకొన్నాడు. దీంతో ఆ వ్యక్తి అచ్చం సినిమాటిక్‌వేలో గాల్లో ఎగిరి కిందపడ్డాడు. తర్వాత లేచి ఏం చక్కా కింద పడ్డ తన బైక్‌ను లేపబోయాడు. అంతెత్తున గాల్లో ఎగిరి కింద పడ్డా కూడా ఆ వ్యక్తికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అక్కడున్న జనాలంతా ఆ వ్యక్తిని ఆశ్చర్యంగా చూశారు. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ ప్రగతి నివేదన సభ సందర్భంగా ట్రాఫిక్‌ను ఆ ప్రాంతంలో మళ్లించారు. రోడ్డును వన్ వే చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news