మరోమారు చమురు మంట … పెరిగిన డిజిల్ ధరలు

-

చమురు మంట మరోసారి తాకింది. దేశవ్యాప్తంగా మరోమారు చమురు ధరలు పెరిగాయి. ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలతో సామాన్యుడి నడ్డి విరుగుతోంది. సగటు ప్రజల జీతంతో సింహభాగాన్ని పెట్రోల్, డిజిల్ ధరలకే వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా మరోమారు డిజిల్ ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వీటితో ప్రజలకు ఉపశమనం ఏదైనా ఉందంటే పెట్రోల్ ధరలు పెరగక పోవడం మాత్రమే. గత 21 రోజుల తర్వాత నేడు డిజిల్ ధరలు పెరిగాయి. రూ. 27 పైసలు పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సామాన్యుడి నిత్యవసరాల ధరలు కొంతలోకొంత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రజలు నిత్యం ప్రయాణించే పాసింజర్ వాహనాలు, నిత్యవసరాలు, ఇతర సామాగ్రిని తరలించే వాహనాల ఛార్జీలు పెరిగాయి. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెరిగిన డిజిల్ ధరల వల్ల ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచే ఆలోచనల చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news