ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్‌ కర్రీని తింటున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే

-

మిగిలిన వెజ్‌ కర్రీస్‌ అమ్మ ఫ్రిడ్జ్‌లో పెట్టి మరుసటి రోజు వేస్తే అస్సలు ఊరుకోరు. ఛీ వద్దూ అంటారు. అదే చికెన్‌, మటన్‌ లాంటివి అయితే.. మొన్నటి అయినా సరే హ్యాపీగా తినేస్తారు. చాలా మందికి నాన్‌వెజ్‌ అంటే అంత ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతోనే మిగిలినపోయిన చికెన్‌ను ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని అది అయిపోయే వరకూ తింటూనే ఉంటారు. కానీ ఇలా చికెన్‌ కర్రీని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తినడం మంచిదేనా..? దీనిపై నిపుణులు ఏం అంటున్నారు..?

ఆహార నాణ్యతా నిబంధనల ప్రకారం.. ఈ రకం వండిన చికెన్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఆపై తినడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రాణాపాయం కూడా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి, మీరు తినే చికెన్ తినడానికి సరిపోతుందో, లేదా పాడైపోయిందో తెలుసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కనీసం ఈ మార్గాలను అనుసరించి అయినా.. వాటిని తినాలా వద్దా డిసైడ్‌ అయితే ప్రమాదం కాసింతైన తగ్గుతుంది.

పాడైన చికెన్‌ను గుర్తించడంలో దీని నుంచి వచ్చే వాసన మనకు చాలా సహాయపడుతుంది. అయినప్పటికీ, అవి చెడిపోయే సంకేతాలను చూపించని సందర్భాలు ఉన్నాయి. సుగంధ ద్రవ్యాలు ,సాస్‌లతో కూడిన కోడి మాంసం దాని రుచి ,వాసన ఒకేలా ఉండటం వల్ల చెడిపోయి ఉంటే గుర్తించడం కష్టం. కానీ మీరు కాస్త వాసనను పసిగట్టే వారైతే దాన్ని సులభం గుర్తించవచ్చు.

పాడైన చికెన్‌ కర్రీ లాంటివి తినడం వల్ల వాంతులు, తల తరిగడం, విరోచనాలు వస్తాయి. ముఖ్యంగా ఫ్రిడ్జ్‌లో పెట్టిన చికెన్‌ కర్రీని వేడి చేసుకుని తింటారు. ఇది ఇంకా ప్రమాదం.

కాబట్టి నాన్‌వెజ్‌ కర్రీని ఫ్రిడ్జ్‌లో పెట్టి అదేపనిగా తినడం మానేయండి. ఎప్పటికప్పుడు ఫ్రష్‌గా వండిన ఆహారం తింటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు. ఫ్రిడ్జ్‌లో ఉంచినా సరే.. ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంటే.. అది చూసేందుకు బాగున్నా తినేందుకు పనికి రాదు అని గుర్తుపెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news