మాంసాహారం తిన్నాక ఎన్ని రోజులకు జీర్ణం అవుతుందో తెలుసా..?

-

మాంసాహారం: సాధారణ ఆహారాలకంటే.. నాన్‌వెజ్‌ డైజెస్ట్‌ అవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది.. మనం తినేప్పుడు హ్యాపీగా తిన్నా.. అది త్వరగా జీర్ణంకాక, అవే త్రేన్పులు, గ్యాస్‌ సమస్యతో ఇబ్బంది పడతాం.. చాలామందిలో ఈ సమస్య ఉంటుంది. అందుకే నాన్‌వెజ్‌ తిన్నవెంటనే శీతలపానియాలు తాగుతుంటారు.. అయితే మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎంత సమయం పడుతుంది.. త్వరగా జీర్ణం కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

 

మాంసాహారం
మాంసాహారం

ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఏ ఆహారం తిన్నా త్వరగా జీర్ణం చేసుకోగలరు. వ్యక్తిని బట్టి ఆహారం జీర్ణం అయ్యే సమయం మారుతూ ఉంటుంది. కానీ వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. మనం తినే మాంసాహారం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయమే పడుతుంది. అందులో ప్రోటీన్లు, కొవ్వులు రెండూ అధికంగా ఉంటాయి. అవి జీర్ణం అయ్యేందుకు సుమారుగా 2 నుంచి 4 రోజుల వరకు సమయం పడుతుంది. ఏంటి షాక్‌ అయ్యారా..? అవును.. అందుకే ఎక్కువగా మాంసాహారం తిన్నప్పుడు మీకు రెండు మూడు రోజుల వరకూ అన్‌ఈజీగా ఉంటుంది. కొంతమంది అయితే.. నాన్‌వెజ్‌ తిన్నాక.. మరుసటి రోజు పెరుగన్నం మాత్రమే తింటారు.. ఇక జీర్ణశక్తి బాగా ఉంటే 24 గంటల్లోనే మాంసాహారం జీర్ణమవుతుంది.

మాంసాహారం త్వరగా జీర్ణం అయ్యేందుకు ఏం చేయాలంటే..

మాంసాహారాన్ని కొందరు మార్కెట్‌ నుంచి తేగానే శుభ్రం చేసి అలాగే వండుతారు. కానీ అలా కాకుండా దాన్ని సుమారుగా 6 నుంచి 8 గంటల పాటు మారినేట్‌ చేయాలి. దీని వల్ల మాంసం మృదువుగా మారుతుంది. త్వరగా ఉడుకుతుంది. అన్ని గంటలు మారినేట్‌ చేస్తే.. తినాలన్న కోరిక ఉత్సాహం అన్నీ పోతాయి అంటారా..? నిజమే.. కనీసం రెండు మూడు గంటలు అయినా మారినేట్‌ చేసేందుకు ప్రయత్నించండి. ఎంత ఎక్కువ సేపు మారినేట్‌ అయితే నాన్‌వెజ్‌ అంత త్వరగా జీర్ణం అవుతుంది.

కొందరు ఆహారాన్ని వేగంగా నమిలి తింటారు. కానీ అలా కాదు. మనం ఆహారాన్ని ఎంత నెమ్మదిగా తింటే అంత మంచిది. ఎక్కువ సేపు ఆహారాన్ని నమిలితే జీర్ణాశయంలో జీర్ణ రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

మాంసాహారం తిన్న తర్వాత పైనాపిల్‌ పండ్లను తింటే మాంసాహారం త్వరగా జీర్ణమవుతుంది. పైనాపిల్‌ పండ్లలో ఉండే బ్రొమెయిలిన్‌ అనబడే ఎంజైమ్‌ మాంసాహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. జీర్ణక్రియ మెరుగు పడుతుంది.

మాంసాహారం తిన్న తరువాత బొప్పాయి పండ్లను తినవచ్చు. వాటిల్లో ఉండే పపైన్‌ అనబడే ఎంజైమ్‌ ప్రోటీన్లను జీర్ణం చేసేందుకు సహాయ పడుతుంది. గ్యాస్, అజీర్ణం సమస్యలు రాకుండా ఉంటాయి.

మాంసాహారం తిన్న తరువాత కొందరు పెరుగు తినరు. కానీ మాంసాహారం తిన్నాక నిజానికి పెరుగు లేదా మజ్జిగను తీసుకోవడం మంచిది.. ఇవి ప్రొ బయోటిక్‌ ఆహారాలు. ఇవి మన జీర్ణాశయంలో మంచి బాక్టీరియాను వృద్ధి చేస్తాయి. దీంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కాబట్టి.. నాన్‌వెజ్‌ తిన్నాక ఇవి ట్రై చేయండి..!

Read more RELATED
Recommended to you

Latest news