చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా..? – విజయసాయిరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు చేసిన వ్యాఖ్యలపై తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. మంగళవారం తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అనుబంధ విభాగాల నేతలతో ఆయన సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ట్రాప్ లో అమిత్ షా పడ్డారా..? అంటూ సెటైర్లు వేశారు.

రాజధానికి కావలసిన భవనాలను రెండేళ్ల క్రితమే గుర్తించామని.. కేంద్రం హామీలను నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖకు కచ్చితంగా పరిపాలన రాజధానిని తరలిస్తామని స్పష్టం చేశారు. చంద్రబాబు మినీ మేనిఫెస్టోను జనం నమ్మరని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో వివిధ పార్టీలు ఇచ్చిన హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్-2 మేనిఫెస్టో ప్రకటిస్తారేమోనని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news