ఎసిడిటీ తో బాధ పడుతున్నారా..? అయితే తప్పక ఇలా చెయ్యండి..!

-

ఎసిడిటీతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. తిన్న ఆహారం జీర్ణం అవ్వక ఎంతో మంది ఇబ్బంది పడతారు. కడుపు ఉబ్బరంగా ఉంటుంది అలానే నోటి నుండి దుర్వాసన ఇవన్నీ కూడా ఎసిడిటీ యొక్క లక్షణాలే. ఎసిడిటీ తో బాధ పడుతున్నట్లయితే ఈ చిట్కాలని పాటించండి వీటిని అనుసరించడం వలన ఆరోగ్యంగా ఉండొచ్చు ఎసిడిటీ సమస్య నుండి బయటపడొచ్చు.

పుదీనా ఆకులు:

పుదీనా ఆకులతో ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు ఉదయాన్నే నాలుగు ఐదు పుదీనా ఆకులు తీసుకుని నమ్మితే ఎసిడిటీ తగ్గుతుంది. ఇందులో ఔషధ గుణాలు కూడా ఉంటాయి ఇవి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. భోజనం తినేసిన తర్వాత పుదీనా ఆకుల జ్యూస్ ని తీసుకుంటే కూడా ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది.

కొబ్బరి నీళ్లు:

భోజనం అయ్యాక 20 నిమిషాలు ఆగి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళని తీసుకోండి. ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

తులసి ఆకులు:

భోజనానికి ముందు తులసి ఆకులని నమిలితే కూడా ఈ సమస్య ఉండదు.

చక్కెర లేని పాలు:

చక్కెర లేకుండా కొంచెం పాలని చల్లగా తీసుకోండి లేదంటే మీరు ఒక చెంచా నెయ్యి వేసి పాలను తీసుకుంటే కూడా ఈ సమస్య తొలగిపోతుంది.

నిమ్మరసం:

భోజనానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని దానిలో టీ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని తాగితే కూడా ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలతో ఈ సమస్యకి దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యము బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news