హోలీ వేడుకల్లో టీమిండియా సభ్యులు

-

ఆస్ట్రేలియాతో జరిగిన హై-వోల్టేజ్ పోరుకు ముందు భారత క్రికెట్ జట్టు సభ్యులు హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ తదితరులతో సహా భారత జట్టు సభ్యులు పండుగ సందడిలో కనిపించారు. సిరీస్‌లోని నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతుంది మరియు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌లో చోటు దక్కించుకోవడానికి విజయం కోసం ఎదురుచూస్తోంది. టీ20 వరల్డ్ కప్ మెుదలుకొని కివీస్, బంగ్లా, ఆసిస్ జట్లతో మ్యాచ్ లు ఆడుతూ.. బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా.. కీలకమైన నాలుగో టెస్ట్ కు టీమిండియా సిద్దం అవుతోంది. ఈ క్రమంలోనే మధ్యలో వచ్చిన హోలీ పండగను అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

భారతదేశ వ్యాప్తంగా మంగళవారం(మార్చి 7) హోలీ వేడుకలను దేశ ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. స్నేహితులు, బంధుమిత్రులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనంద డోలికల్లో మునిగితేలారు. ఇక హోలీ పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేసుకున్నారు టీమిండియా ఆటగాళ్లు. తమ జర్నీలోనే ఈ సంబరాలను నిర్వహించారు భారత ప్లేయర్స్.బస్సులో వెళ్తూ.. రంగులు పూసుకుని హోలీని ఘనంగా జరుపుకున్నారు. కోహ్లీ సింప్లీ డ్యాన్స్ స్టెప్పులతో అదరగొడితే.. రోహిత్ తన ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. గట్టిగా అరుస్తూ.. వీడియో తీస్తున్న శుభ్ మన్ గిల్ ఫోన్ పై రంగు చల్లాడు.

ఈ క్రమంలోనే బస్సులో అందరు ఆటగాళ్లు ఆడుతూ.. పాడుతూ.. హోలీని ఎంజయ్ చేశారు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్ల హోలీ సెలబ్రేషన్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆసిస్ తో కీలకమైన నాలుగో మ్యాచ్ మార్చి 9న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కు నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. పైగా ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు అటు ఆసిస్ ప్రధానితో పాటుగా.. ఇటు భారత ప్రధాని కూడా మైదానానికి రానున్నారు. ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ ను చూడనున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Team India (@indiancricketteam)

Read more RELATED
Recommended to you

Latest news