గర్భిణీలు, బాలింతలు ఈ విషయాలు అస్సలు నమ్మకూడదట..!

-

మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైన తల్లి కాబోతున్నారా..అయితే మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి ఉంటుంది. సాధారణంగా  ఇంట్లో ఉండే ముసలివాళ్లు, ఇరుగుపొరుగు చాలా చెప్తూ ఉంటారు. వాల్లు చెప్పినవన్నీ చేస్తే మీతో పాటు మీ బిడ్డకు కూడా ప్రమాదం జరగవచ్చు. పుట్టబోయే బిడ్డకు సంబంధించిన సమాచారం ఇంటర్ నెట్ లో మనకు చాలా దొరుకుతుంది. దాంతోపాటు కుటుంభీకులు  సొంత అభిప్రాయాలు చెబుతారు. అయితే వీటిలో చాలావరకు అపోహలే అని తల్లి తెలుకోవాల్సి ఉంటుంది. అవేంటే ఇప్పుడు చూద్దాం.

అపోహ 1…

పుట్టబోయే శిశువు ఆడా, మగా అని గర్భవతి పొట్టను చూసి కొందరు అంచనా వేస్తారు. అదే ఒకవేళ గర్భం సైజు చిన్నగా ఉంటే.. పుట్టబోయేది మగపిల్లాడు అని.. కడుపు పెద్దగా ఉంటే.. ఆడపిల్ల అని చెప్తారు.
ఫ్యాక్ట్‌ ఏంటంటే..
నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ NHS  ప్రకారం ఈ అపోహకు సైంటిఫిక్‌ మద్ధతు లేదు. అసలు పిల్లల లింగాన్ని నిర్ధారించడానికి, కడుపు పరిమాణానికి ఏ సంబంధం ఉండదట. ఇది గర్భిణి కండరాల పరిమాణం, నిర్మాణం, ఆకారం, పిండం ఉన్న స్థానాన్ని బట్టి.. ఆమె కడుపు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ అపోహను తల్లి అసలు నమ్మకూడదండి.

అపోహ 2..

అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి ముర్రుపాలు ఇవ్వకూడదంటారు.
ఫ్యాక్ట్‌..
ముర్రుపాలు అంటే మొదటగా వచ్చే తల్లిపాలు. అవి కాస్త పసుపు రంగులో ఉంటాయి. ఇవి ప్రోటీన్లతో నిండిన కొలొస్ట్రమ్‌. దీనిలో బిడ్డకు అంటువ్యాధులు రాకుండా నివారించే లక్షణాలు  బోలడెన్ని ఉంటాయి. కాబట్టి ఈ పాలను శిశువుకు కచ్ఛితంగా పట్టాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయినప్పటికీ మన దేశంలో ఇప్పటికీ ముర్రుపాలు పట్టకూడదని నమ్మి పట్టకుండా ఉంటారు.

అపోహ3..

నవజాత శిశువుకు పుట్టగానే ముందుగా తేనె ఇవ్వాలి అని అంటారు. ఇది పురాతన సంప్రదాయం.
ఫ్యాక్ట్‌..
నవజాత శిశువుకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. తేనెలో అపరిపక్వతలో ఉన్న క్లోస్ట్రిడియం బోటులినమ్‌ అనే బ్యాక్టిరియా బీజాంశాలు కలిగి ఉంటుంది. ఇది శిశువు ఇవ్వటం ద్వారా శిశు బోటులిజం అనే ప్రాణాంతక వ్యాధికి కారణమవుతుంది. ఇది ప్రమాదకరం. కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డకు అస్సులు తేనె ఇవ్వకూడదు.

అపోహ4..

నవజాత శిశువుకు ఆహారంగా పండ్ల రసాలను ఇవ్వచ్చు.

ఫ్యాక్ట్‌..
పండ్ల రసాల్లో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. కానీ, ఇది శిశువు పేగులపై ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే నవజాత శిశువులు మొదటి ఏడాదిలో పండ్ల రసాలను జీర్ణించుకోలేరు కాబట్టి ఎలాంటి పండ్ల రసాలు ఇవ్వకపోవటం మంచిది.

అపోహ5..

రెండు లేదా మూడో గర్భంతో పోలిస్తే.. మొదటి కాన్పు కాస్త ఆలస్యంగా అవుతుంది.

నిజం ఏంటి?

ఇది నిజం కాదు! వైద్యులు మహిళ రుతుచక్రం ఆధారంగా డెలివరీ డేట్‌ను ఫిక్స్‌ చేస్తారు. ఒకవేళ పిరియడ్స్ తక్కువ సమయం ఉంటే.. ముందుగా డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. రుతుచక్రం సమయం ఎక్కువైతే.. కాస్త ఆలస్యం కావచ్చు. అయితే, రుతుచక్రం 28 రోజులు ఉంటే, ఆ గడువు తేదీకి దగ్గరగా వచ్చినపుడు అప్పటి పరిస్థితులను బట్టి డెలివరీ చేస్తారు.
ఇవండి..ఆధారాలు, సైన్స్ చెప్పినవి నమ్మటం మంచిది. అలా అని పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టమని కాదు.  మనకు తెలియకుండానే ఆచారల పేరుతో ఆపదలో పడే ప్రమాదం ఉంది.
– Triveni Naidu

Read more RELATED
Recommended to you

Latest news