వాట్ ఏ ఐడియా..పాత బస్సును అందమైన రెస్టారెంట్ గా మార్చారు..

-

ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అని అందరికి తెలిసిందే..అలా చిన్న ఐడియాతో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి ఒక ఐడియా ఇద్దరి జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది..వ్యాపారం చేయాలనే వారి ఆలోచన ముగ్గురు యువకుల జీవితాలను పూర్తిగా మార్చి వేసింది.కరోనా వల్ల లాక్‌డౌన్ పెట్టినప్పుడు ఓ ముగ్గురు వ్యక్తుల మదిలో మెరుపులాంటి ఆలోచన తట్టింది. అనుకున్నదే తడవుగా వారు ఓ పాత బస్సును కొనుగోలు చేసి, దానికి సరికొత్త సొగసులు అద్దారు.

తమ ఆలోచనలకు తగ్గట్లు డైన్ ఆన్ బస్’ రెస్టారెంట్‌కు రూపం తీసుకొచ్చారు. ప్రారంభించిన కొన్నాళ్లకే వారి ప్రయత్నం విజయవంతం అయింది. కస్టమర్లు పెద్ద ఎత్తున వస్తుండడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఈ రెస్టారెంట్ గురించి పూర్తీ వివరాలు ఇలా..ఇది కర్నూల్ జిల్లాలో ఉంది.కర్నూలుకు చెందిన శేఖర్ టాటా కంపెనీలో డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతని స్నేహితుడు వినయ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్. శేఖర్ తమ్ముడు శ్రీకాంత్ కర్నూలులో ఉండేవాడు. ఈ ముగ్గురికీ కరోనా లాక్‌డౌన్ సమయంలో ఏదైనా రెస్టారెంట్ పెట్టాలనే ఆలోచన వచ్చింది.

ఇందుకోసం..ఓ పాత లగ్జరి బస్ ను కొనుగోలు చేశారు.వ్యాపారానికి తగ్గట్టు మార్చుకున్నారు. అలా వారి థీమ్ రెస్టారెంట్ ‘డైన్ ఆన్ బస్‌’కు రూపకల్పన జరిగింది. దీనిని ప్రారంభించిన మొదట్లో వెజ్ ఐటమ్స్ మాత్రమే అందించే వారు. కొన్నాళ్లకు నాన్ వెజ్ పదార్థాలు కూడా పెట్టడంతో విపరీతంగా ప్రజాదరణ పెరిగింది. దీంతో రోజూ ఆ రెస్టారెంట్‌కు చాలా మంది క్యూ కడుతున్నారు. ఆ బస్సుకు రెండు కంటైనర్లను జోడించారు. అందులో 64 మంది వరకు కూర్చోవచ్చు. రాత్రిపూట చల్లటి గాలిని ఆస్వాదిస్తూ, భోజనం చేసేందుకు చాలా మంది అక్కడకు వస్తున్నారు. వ్యాపారం బాగుండడంతో టిఫిన్లు, ఐస్ క్రీమ్ పార్లర్ కూడా తెరిచారు..రుచికరమైన వివిధ ఆహార పదార్థాలను అందిస్తున్నారు.. అక్కడ రుచికి అలవాటు పడిన వాళ్ళు రోజు రోజుకు పెరుగుతున్నారు.మొత్తానికి వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news