టిష్యూ పేపర్‌ను లక్షలు పోసి కొన్నాడా వ్యక్తి.. ఎందుకంటే..!!

-

టిష్యూ పేపర్‌లు పెద్దగా కాస్ట్‌ ఉండవు. హోటల్స్‌లో కూడా అందుకే ఎక్కువగా పెడతారు. చాలామందికి రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు టీష్యూలు ఎత్తేసే అలవాటు కూడా ఉంటుంది. రూ. 50 పెడితే కట్టకు కట్ట వస్తుంది. కానీ ఆ టిష్యూ పేపర్‌ కొనాలంటే.. లక్షలు పెట్టాలి. అవునండి. ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో రూ. 6.36 లక్షలు పెట్టి టిష్యూపేపర్‌ కొన్నాడు. ఎందుకు..? అంత ఖరీదు..? అసలు అది టిష్యూ పేపరేనా..?

ఓ వ్యక్తి ఆన్‌లైన్లో ఓ అక్షరాలా 6.36 లక్షల రూపాయలు. టిష్యూ పేపర్‌ని జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించి మరీ దాచుకోబోతున్నాడట. అంతగా దాని స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? దానిపై ఓ వ్యక్తి సంతకం ఉంది. అతను ప్రముఖ సింగర్. సౌదీ అరేబియా సింగర్. పేరు మహ్మద్ అబ్దు. ఇతని పాటలంటే గల్ఫ్‌ దేశస్థులకు బాగా ఇష్టం.. అతడి షోలు ఉన్నాయంటే ఎగబడిపోతారు. కొన్ని రోజుల క్రితం ఆ గాయకుడు సౌదీ అరేబియాలోని అభా నగరంలో ఓ షో ఇచ్చాడు. దానికా ప్రేక్షకులు భారీగా వచ్చారు. ఆ కార్యక్రమంలో ఆయన ఓ టిష్యూ పేపర్ ని వాడి పక్కన పడేశాడు. అలా పడేయడం చాలా మంది ప్రేక్షకులు చూశారు. దాని కోసం ఎగబడిన వాళ్లు కూడా ఉన్నారట. ఇదంతా చూసిన షో నిర్వాహకులు ఆ టిష్యూ పేపర్ తీసి భద్రపరిచారు. తరువాత ఆ పేపర్ పై సంతకం పెట్టమని గాయకుడిని అడిగారు. మహ్మద్ అబ్ధు సంతకం చేసి అక్కడ్నించి వెళ్లిపోయారు. ఇక్కడి వరకూ బానే ఉంది కదా.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ఆ టిష్యూ పేపర్‌ను అమ్మి డబ్బు సంపాదించాలనుకున్నారు ఆ షో నిర్వాహకులు. ఆన్ లైన్లో దాన్ని అమ్మకానికి పెట్టారు. దాదాపు 30 వేల సౌదీ రియాల్ గా ధరను నిర్ణయించారు. అంటే మన రూపాయల్లో ఆరు లక్షల 36 వేల రూపాయలన్న మాట. దీన్ని కొనాలనుకుంటే ఆ మొత్తం ఒక్కసారే ఇవ్వక్కర్లేదు. నాలుగు ఇన్‌స్టాల్మెంట్లుగా కట్టవచ్చు అని ఆఫర్‌ కూడా పెట్టారు.. ఆయన అభిమానులు ఈ టిష్యూని చూసి ఇదెక్కడ విడ్డూరం అని కామెంట్లు చేశారు. కానీ ఒక అభిమాని మాత్రం కొనేశాడు.

ఇంతకుముందు ప్రపంచం మెచ్చిన సాకర్ ఆటగాడు మెస్సీ కూడా తన ఆటకు గుడ్ బై చెప్పినప్పుడు ఉబికి వస్తున్న కన్నీళ్లను ఓ టిష్యూ పేపర్తో తుడుచుకున్నాడు. ఆ టిష్యూ కూడా వేలంలో ఏకంగా ఏడున్నరకోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.

తాజాగా ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ ఉపయోగించిన జావెలిన్ ను వేలంలో భారీ ధరకు దక్కించుకుంది బీసీసీఐ. ఏకంగా కోటిన్నర రూపాయలకు కొనుక్కుంది.

Read more RELATED
Recommended to you

Latest news