ఈ కుర్చీలో కూర్చుంటే మరణమే!

-

అది ‘డెత్‌ చైర్‌’.. సాదా సీదా కుర్చీ కాదు.. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రమాదకర కుర్చీ. ఇందులో కూర్చున్న ఏ వ్యక్తి ఇప్పటి వరకు ప్రాణాలతో లేరు. దీన్ని వేళాకోళం చేసిన వ్యక్తులు కూడా ఘోరంగా చనిపోయారు. అందుకే దీన్ని అందరూ ‘డెత్‌ ఛైర్‌’ అంటారు. ఓ వ్యక్తి ఎంతో ప్రాణంగా చూసుకున్న ఈ కుర్చి.. అతడి మరణం తర్వాత ఇతరుల ప్రాణాలు తీయడం ప్రారంభించింది. కొన్ని దశబ్దాలుగా 200 మంది కేవలం ఈ కుర్చీ వల్లే చనిపోయారంటే నమ్మశక్యం కాదు. మొదట్లో ఆ మరణాలు ఎలా జరిగేవో ఎవరికీ తెలియలేదు. కాలక్రమేనా.. అసలు నిజం తెలిసింది. అది మాములు కుర్చీ కాదని, ఓ వ్యక్తి ఆత్మ అని తెలిసింది. చివరికి దాన్ని ఓ మ్యూజియానికి అప్పగించారు. ఎవరైనా సందర్శకులు ఆ కుర్చిలో కూర్చుంటారనే భయంతో దాన్ని గోడకు వేలాడి దీశారు. ఆ కుర్చీని ముట్టుకుంటే ప్రమాదమని దాని చరిత్రను సైతం అక్కడ రాసి పెట్టారు.అసలు ఈ కుర్చి కత ఎంటో మనం తెలుసుకుందాం. ఇంగ్లాండ్‌లోని నార్త్‌ యార్క్‌షైర్‌లోని త్రిస్క్‌ అనే ప్రాంతం 1600 సంవత్సరంలో సాంప్రదాయ మార్కెట్లకు ప్రాముఖ్యం కలది. డానియల్‌ ఔటీ అనే చిల్లర దొంగ ఉండేవాడు. అతడి కుమార్తె ఎలిజిబెగ్‌ ఔటీ థామస్‌ బస్బే అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. బస్బే కూడా డానియల్‌తో కలిసి దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు.

కుర్చీకధ

బస్బేకు, భార్య ఎలిజబెత్‌కు మధ్య తరచుగా గొడవలు వచ్చేవి. దీంతో తండ్రి డానియల్‌ ఆమెను తన ఇంటికి తీసుకెళ్లేందుకు కూతురి దగ్గరకు వెళ్లాడు. బస్బే ఇంటికి వెళ్లేసరికి తనకు ఇష్టమైన కుర్చీలో కూర్చున్న డానియల్‌ను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఇద్దరూ తీవ్రంగా గొడవ జరిగింది. వారిని విడిపించేందుకు ఎలిజబెత్‌ ప్రయత్నం చేసింది. చివరికి డానియల్‌ కూతురిని తన వెంట తీసుకెళ్లకుండానే వెళ్లిపోయాడు. ఒకరోజు వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తన ఫామ్‌ హౌస్‌కు రావాలని, అక్కడ మాట్లాడుకుందామని బస్బే డానియల్‌ను పిలిచాడు. అక్కడికి వచ్చిన డానియల్‌ను బస్బే సుత్తితో తలను పగలగొట్టి చంపేశాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భార్య ఎలిజబెత్‌ ఇంట్లోని ఫర్నీచర్‌ను ఓ హోటల్‌కు ఇచ్చేసింది. అందులో బస్బే ఇష్టపడే కుర్చీ కూడా ఉంది.

బస్బేకు కోర్టు ఉరి శిక్ష విధించింది. ఉరి అమలు సమయంలో బస్బే చివరిగా ఓ కోరిక తీర్చాలని కోరాడు. మరణానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన కుర్చీలో కుర్చుంటానని చెప్పాడు. దీంతో అతన్ని ఉరి తీయడానికి ముందు ఆ హోటల్‌కు తీసుకెళ్లారు. బస్బే తన కుర్చీలో కాసేపు కుర్చొని, భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత అతడిని ఉరి తీశారు.

ఈ ఘటనతో బస్బే పేరు మారుమోగింది. అంతా ఆ హోటల్‌ను బస్బే హోటల్‌ అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో ఆ హోటల్‌ యాజమాన్యం ఆ పేరును సొమ్ము చేసుకోవాలని భావించి, ఆ హోటల్‌ పేరును ‘ద బాస్బే స్టూప్‌ ఇన్‌’ అని మార్చింది. అతడు ఉరికి ముందు కూర్చున్న కుర్చీ తమ హోటల్‌లోనే ఉందంటూ ప్రచారం చేసింది. ఊహించినట్లే అంతా ఆ హోటల్‌కు వచ్చి ఆ కుర్చీని చూడటం ప్రారంభించారు. అందులో కుర్చొని తాము బస్బే కుర్చీలో కుర్చున్నామని గొప్పగా చెప్పుకొనేవారు.

కొద్దిరోజులకే భయానక విషయం బయటపడింది. ఆ కుర్చీలో కుర్చున్న వ్యక్తులు వేర్వేరు కారణాలతో చనిపోయేవారు. కొన్నాళ్లు ఆ మరణాల వెనుక కారణాలేమిటనేది తెలియలేదు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. కొంతమంది సైనికులు ఆ హోటల్‌లోనే తలదాచుకున్నారు. ఈ సందర్భంగా కొందరు ఆ బస్బే కుర్చీలో కుర్చొన్నారు. ఆ తర్వాత రోజే వారంతా బాంబు దాడిలో చనిపోయారు. యుద్ధంలో ఇదంతా సర్వసాధారణమని భావించారు.

ఓ వ్యక్తి ఆ కుర్చీలో కుర్చుని మద్యం తాగాడు. ఉదయం చూసేసరికి అతడు ఓ స్తంభానికి వేలాడుతూ కనిపించాడు. తొలుత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని భావించారు. కానీ, కొందరు మాత్రం.. ఇది తప్పకుండా ఆ కుర్చీ పనే కావచ్చని అనుమానించారు. యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పాటుచేసిన విందులో ఇద్దరు సైనికులు ఆ కుర్చీలో కుర్చోడానికి పోటీపడ్డారు. చివరికి వారిద్దరి కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

ఆగని మరణాలు

ఆ మరణాలు అక్కడితో ఆగలేదు. స్థానికులు కూడా ఆ కుర్చీ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే అపవాదును ఆ హోటల్‌పై వేయడం మొదలుపెట్టారు. దీంతో హోటల్‌ భవన యజమాని టోనీ ఎర్న్‌షా ఇకపై అందులో ఎవరూ కుర్చోకూడదని దాన్ని సెల్లార్‌లో పెట్టారు. ఓ రోజు హోటల్‌కు సామాన్లు తీసుకొచ్చిన డెలివరీ డ్రైవర్‌.. సెల్లార్‌లోకి వెళ్లి ఆ కుర్చిలో కుర్చున్నాడు. కొన్ని గంటల తర్వాత అతడు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. దీంతో ఎర్న్‌షా ఆ కుర్చుని త్రిస్క్‌ మ్యూజియానికి అప్పగించాడు.

ఆ కుర్చిని నేలపై ఉంచితే ఎవరైనా కుర్చొనే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో దాన్ని గోడకు వేలాడ దీసింది మ్యూజియం యాజమాన్యం. అది ఎంత ప్రమాదకరమో తెలుపుతూ ఓ కథనాన్ని రాసిపెట్టారు. కుర్చీలో కుర్చున్నవారు ఎందుకు చనిపోతున్నారో తెలుసుకొనేందుకు ఫర్నీచర్‌ హిస్టోరియన్‌ డాక్టర్‌ ఆడమ్‌ బావెట్‌ రంగంలోకి దిగారు. మ్యూజియంలో ఉన్న ఆ కుర్చీ బెస్బే ఉరి సమయంలో కుర్చున్నది కాదని తెలిపారు. అది సుమారు 138 ఏళ్ల కిందటిదని పేర్కొన్నారు. మరి, అది నిజమైన బెస్బే కుర్చీ కాకపోయి ఉంటే.. ఎవరిది? హోటల్‌ నిర్వాహకులు బెస్బే కుర్చీని మరెక్కడైనా దాచిపెట్టారా? అనే అనుమానాలెన్నో వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news