గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

-

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సబ్సిడీ లేని గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరను 100.50కు తగ్గించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ గ్యాస్ ధరలు తగ్గడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం వల్లనే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.

ప్రస్తుతం సబ్సిడీ లేని ఎల్పీజీ ధర న్యూఢిల్లీలో 737.50 రూపాయలుగా ఉంటే.. తగ్గిన ధరతో రూ.637గా ఉండనుంది. ఈ రేట్లు ఈరోజు(సోమవారం) నుంచి అమలులోకి రానున్నాయి. ఇక.. సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ దర 494.35 కాగా.. దాని మీద వచ్చే సబ్సిడీ 142.65ని ముందే చెల్లించాలి. అది తర్వాత బ్యాంక్ ఖాతాలో పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news