భలే పందెం గురూ.. భార్యను మోసుకుంటూ తిరుమల మెట్లెక్కిన భర్త

-

ఇద్దరు భార్యాభర్తలు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. అయితే వాళ్లు మెట్ల దారిలోనే శ్రీవారి దర్శనం చేసుకోవాలని మొక్కుకోవడంతో ఆ దారిలోనే వారి ప్రయాణం షురూ చేశారు. కానీ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత భార్య అలసిపోయింది. తన భర్త వేగాన్ని అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సరదా సంభాషణ సాగింది. భార్య ఓ ఉపాయాన్ని ఆలోచించి భర్తతో పందెం వేసింది. తనను మోస్తూ మెట్లు ఎక్కాలని భర్తతో బెట్ వేసింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన వరదా వీరవెంకట సత్యనారాయణ (సత్తిబాబు), లావణ్యకు 24 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరి కుమార్తెలకు వివాహాలు చేశారు. ఆ దంపతులు ఇటీవల తిరుపతికి వెళ్లారు. తిరుమలలోని శ్రీవారిని కాలినడకన దర్శించుకోవడానికి బయలుదేరారు.

మెట్ల మార్గంలో సత్తిబాబు వేగాన్ని ఆయన భార్య అందుకోలేకపోయారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ పందేనికి దారితీసింది. ఆ మేరకు సత్తిబాబు భార్యను భుజాలపై ఎత్తుకుని దాదాపు 70 మెట్లు ఎక్కేశాడు. ఆ దృశ్యాలను ఇతర భక్తులు చరవాణుల్లో బంధించారు. ప్రస్తుతం అవి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news