IND vs SA : భారీ స్కోర్‌తో బతికిపోయిన టీమిండియా..

-

సౌత్ ఆఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో టీమిండియా 16 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. సఫారీల ముందు 238 పరుగుల లక్ష్యం ఉంచిన టీం ఇండియా… ఆ టీం ను కట్టడి చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా మిడిల్ అండ్ బ్యాట్స్మెన్లు.. దాటిగా ఆడినప్పటికీ చివరికి టీం ఇండియా నే విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్ లో వేగంగా రెండు వికెట్లు తీసి సౌత్ ఆఫ్రికా ను దెబ్బ కొట్టాడు. ఇక అటు సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లలో… డేవిడ్ మిల్లర్ సెంచరీ చేయగా డికాక్ 69 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకుండా పోయింది. టీమిండియా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి విజృంభించి 61 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 57 పరుగులు, కోహ్లీ 49 పరుగులు అలాగే రోహిత్ శర్మ 43 పరుగులు చేసి రాణించారు. ఇక ఈ విజయంతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news