భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ట్రంప్ కుమార్తె ఇవాంకా డ్ర‌స్ ఖ‌రీదు ఎంతో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా భారత్ పర్యటనకు విచ్చేశారు. భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెడ్ కుష్నర్ తదితరులు ట్రంప్ వెంట పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని ప్రపంచ అతిపెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమాన్ని ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ కూడా వీక్షించారు. ఇక ప్ర‌స్తుతం అహ్మదాబాద్ లోని మోతెరా స్టేడియంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు ముగిశాయి. అనంతరం, తన పర్యటనలో భాగంగా ట్రంప్ తన భార్యతో కలిసి ఆగ్రా లోని తాజ్ మహల్ ను సందర్శించేందుకు బయలుదేరారు.

ఇదిలా ఉంటే.. ట్రంప్ కుమార్తె ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె వేసుకున్న డ్రెస్‌కు పెట్టిన ఖర్చు గురించి జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆమె విమానం దిగిన దగ్గర నుంచి తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇవాంక ధరించిన డ్రెస్‌ భారత కరెన్సీలో రూ.1.7లక్షలు కావడం విశేషం. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్‌ ధరించారు. స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో వచ్చిన ఇవాంక స్టేడియంలో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news