పప్పులో కాలేసిన లోకనాయకుడు కమల్ హాసన్.. నెటిజన్ల ట్రోలింగ్

-

లోకనాయకుడు కమల్ హాసన్ పప్పులో కాలేశాడు. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో షేర్ చేసి విమర్శలకు అవకాశమిచ్చాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే…ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రాను దేశవ్యాప్తంగా అందరూ అభినందిస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఫొటో, వీడియో షేర్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు. నీరజ్‌ను చూసి దేశం గర్వపడుతుందని పోస్టులు పెడుతున్నారు. కాగా తమిళ్ హీరో, పొలిటీషియన్ కమల్ హాసన్ నీరజ్ చోప్రా ఫొటోకు బదులు శివపాల్ సింగ్ ఫొటోను జత చేసి ట్విట్టర్ వేదికగా జత చేసి శుభాకాంక్షలు తెలిపారు. అది చూసి నెటిజనాలు ఆయన్ను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. క్రీడాకారుడి ఫొటో దొరకలేదా మీకు? అని నెగెటివ్ కామెంట్స్ చేశారు నెటిజన్లు.

ఈ క్రమంలో సరైన ఫొటో‌తో మళ్లీ ట్వీట్ చేశారు కమల్ హాసన్. మా అందరి తరఫున నీకు కృతజ్ఞతలు.. గోల్డ్ మెడల్ సాధించి మా అందరిని గర్వపరిచావు అని పోస్ట్ పెట్టారు కమల్. .ఇకపోతే పోయిన వారం బాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఫర్హాన్ అక్తర్ కూడా సోషల్ మీడియా వేదికగా మిస్టేక్ చేశాడు. ఇండియా మెన్ హాకీటీమ్‌ను కంగ్రాచులేట్ చేయబోయి ఉమెన్స్ హాకీ టీమ్‌ను కంగ్రాచులేట్ చేశాడు. ఆ తర్వాత మిస్టేక్ తెలుసుకుని మునుపు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశాడు ఫర్హాన్. మొత్తంగా సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ప్రజెంట్ వరల్డ్ మొత్తం సోషల్ మీడియాలో ఉండిపోతుండగా, ప్రతీ ఒక్కరు అప్‌డేటెడ్‌గా ఉంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news