కోర్టు: భార్య, పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు..!

-

మేనేజ్మెంట్ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం పిల్లలు, భార్య మాత్రమే కాదు… తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు అని చెప్పింది. అయితే ఎలా అయితే పిల్లలకి, భార్యకి హక్కు ఉందో..! అలానే తల్లిదండ్రులకు కూడా కొడుకు సంపాదనపై వాటా ఉంది అని కోర్టు చెప్పడం జరిగింది.

హజారే కి సంబంధించిన ప్రదేశంలో జడ్జి Girish Kathpalia అప్లికేషన్ గురించి విని ఢిఫెండెంట్ భార్యని తన భర్త ఆదాయాన్ని ఫైల్ చేయమని చెప్పాడు. తన భార్య భర్త ఆదాయం నెలకి 50,000 రూపాయలు అని చెప్పింది. ఆమె భర్త తనకి, తన కొడుకుకి నెలకి రూ.10000 మాత్రమే ఇస్తున్నాడు అని చెప్పింది. కోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ ని ఆ వ్యక్తికి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ చేయమంది. సరైన ఆధారాలు అతను ప్రవేశపెట్టాడు.

అతని ఇన్కమ్ టాక్స్ అకౌంట్ కి సంబంధించి అతని నెలవారి ఆదాయం రూ. 37,000 అతనే అనారోగ్య ఖర్చులను, రోజు వారి ఖర్చులు అన్ని భరిస్తాడు అని నివేదిక ద్వారా వెల్లడయింది. ఈ విషయాన్ని కోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. అయితే భర్త తన బిడ్డల పట్ల చాలా బాధ్యత వహించాలని అందుకే వాళ్ల మెయింటనెన్స్ డబ్బులు పెంచాలని చెప్పిన సంగతి తెలిసినదే.

కానీ కోర్టు ఆ వ్యక్తి యొక్క ఆదాయాన్ని ఆరు భాగాలుగా విభజించింది. కొడుకు, భార్య, అమ్మ, నాన్న కి ఒక్కొక్క షేర్ ని ఇవ్వాలని చెప్పింది. కోర్టు భరణాన్ని పెంచాలన్న విజ్ఞప్తిని కొట్టివేసింది. భార్య కొడుకు వాటా 12,500 రూపాయలు అని కోర్టు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అందువల్ల భర్త ప్రతి నెల పదవ తేదీన తన భార్య మరియు కొడుకుకి ఇంత భరణాన్ని చెల్లించాలి. అలానే కోర్టు ఏం చెప్పిందంటే ఒక వ్యక్తి ఒక ఆదాయం ఒక కేకు లాంటిది. దానిని కుటుంబమంతా సమాన ముక్కలుగా చేసుకుని తీసుకోవాలి అని చెప్పింది. ఈ విధంగా ఆదాయాన్ని కూడా చేయాలని కోర్టు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news