కాబూల్‌ను వీడుతున్న అమెరికా చివ‌రి సైనికుడి ఫొటో వైర‌ల్‌..

-

ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు తమ స్వాధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఆ దేశ ప్రజలు భయాందోళనతో భీతిల్లుతున్న సంగతి అందరికీ విదితమే. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశాన్ని వదిలి పారిపోయిన వారు బోలెడు మంది ఉన్నారు. అందులో ఆప్ఘన్ దేశ తొలి మహిళా ఎంపీ, సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ఉన్నారు. ఇకపోతే అమెరికా వల్లే ఆప్ఘన్ తాలిబన్ల వశమైందని విమర్శలూ ఉండగా, తాజాగా ఆప్ఘనిస్తాన్ నుంచి అగ్రరాజ్యం తన బలగాలను వెనక్కి తెచ్చుకుంది. దాదాపుగా 20 ఏళ్లు ఆప్ఘన్‌లో ఉన్న బలగాలు ఇప్పుడు ఆ దేశం నుంచి విత్ డ్రా అయ్యాయి.

కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి అగ్రరాజ్య సైనిక బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేశాయి. అమెరికాకు చెందిన సీ-17 విమానం ద్వారాసేనల ఉపసంహరణ పూర్తి అయింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ‘ఆప్ఘన్ చివరి సైనికుడి’ పేరిట అమెరికా రక్షణ శాఖ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది. ఆప్ఘనిస్తాన్ దేశం నుంచి అమెరికాకు వచ్చిన ఆ చిట్టచివరి సోల్జర్ ఎవరంటే.. 82వ ఎయిర్‌బోర్న్‌ డివిజన్‌, 18 ఎయిర్‌బోర్న్‌ కార్ప్స్ కమాండర్‌, మేజర్‌ జనరల్‌ క్రిస్‌ డోనా.. అతడు అమెరికా వైమానిక దళ విమానం సీ-17లో ప్రవేశించడంతో కాబూల్‌లో యూఎస్‌ మిషన్‌ ముగిసింది అని అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అతడి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

కాగా, ఈ ఫొటోను చూసి నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఆప్ఘనిస్తాన్‌పై అగ్రరాజ్య పెత్తనం ఇక ముగిసిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండగా, మరి కొందరు త్వరలో తాలిబన్ల అరాచకాలు ఇంతకు మించి ఉంటాయని అంటున్నారు. అయితే, తాలిబన్ల క్రూరమైన పాలన గురించి తెలుసుకుని ఇప్పటికే చాలా మంది దేశం విడిచి పారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఇక ఆ దేశంలో మిగిలి ఉన్న ఆప్ఘన్ ప్రజలు, విదేశీయులు కూడా త్వరలో ఒక్కరూ కూడా లేకుండా వెళ్లిపోయేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, అమెరికా తమ దేశంతో పాటు మిత్రదేశాలకు చెందిన వేలాది మందిని మిషన్ మోడ్‌లో ఆప్ఘనిస్తాన్ నుంచి తరలించినట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news