కొత్త ట్రెండ్ బాస్.. పళ్లకు కూడా రంగులేసుకోవచ్చు..!

-

చూశారుగా పైన ఫోటో. అబ్బే.. పళ్లేంది అలా ఉన్నాయి అని దీర్ఘాలు తీయకండి. ఇంకా చాలా ఫోటోలు ఉన్నాయి చూద్దురు గానీ.. అసలు విషయం తెలుసుకోండి ముందు. దీన్ని టూత్ పాలిష్ అని పిలుస్తారు. చాలామంది పళ్లు తెల్లగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. కానీ.. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. అదే పళ్లకు కలర్లేయడం. అదే ఫ్యాషన్ ఇప్పుడు. ఈ ట్రెండ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పెదాలకు రకరకాల లిప్ స్టిక్స్ వేసుకున్నట్టే.. పళ్లకు కూడా రకరకాల కలర్స్ వేసుకుంటే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించీ.. చించీ.. ఈ కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చింది క్రోమ్ అనే బ్యూటీ కంపెనీ. అదే రెయిన్ బో టూత్ పేరుతో వచ్చిన టూత్ పాలిష్. నెయిల్ పాలిష్ లాగానే పళ్ల పాలిష్ అన్నమాట. ఇప్పుడు యూఎస్ లో చాలా మంది సెలబ్రిటీలు ఇదే ట్రెండ్ ఫాలో అవుతారు.

అబ్బే.. పళ్లకు కలర్లు వేసుకుంటే ఎలా ఉంటుంది అని అంటారా.. చూడండి.. వీళ్లు పాలిష్ వేసుకొని ఎలా తళతళా మెరుస్తున్నారో.

Read more RELATED
Recommended to you

Exit mobile version