వాహ‌న‌దారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక‌పై అత్యంత శుభ్రమైన పెట్రోల్‌, డీజిల్ పొంద‌వ‌చ్చు..!

-

దేశంలోని వాహ‌న‌దారుల‌కు పెట్రోలియం కంపెనీలు శుభ‌వార్త చెప్పాయి. ఇక‌పై అత్యంత శుభ్ర‌మైన (క్లీనెస్ట్‌) పెట్రోల్‌, డీజిల్‌ను వారు కొనుగోలు చేయ‌వ‌చ్చు. బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను ఇక‌పై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ పంపుల్లోనూ విక్ర‌యించ‌నున్నారు. అయితే వాటి ధ‌ర‌ల‌ను మాత్రం పెంచ‌లేద‌ని పెట్రోలియం కంపెనీలు తెలిపాయి.

vehicle drivers in india now can get cleanest petrol and diesel

ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా కేవ‌లం బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న వాహ‌నాల‌ను మాత్ర‌మే విక్ర‌యించాల‌ని గ‌తంలో సుప్రీం కోర్టు చెప్పిన విష‌యం విదిత‌మే. అయితే క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో బీఎస్ 4 వాహ‌నాల అమ్మ‌కాలు ఆగిపోవ‌డం వ‌ల్ల ఏప్రిల్ 14వ తేదీన లాక్‌డౌన్ అనంత‌రం మ‌రో 10 రోజుల పాటు బీఎస్ 4 వాహనాల‌ను అమ్ముకునేందుకు సుప్రీం కోర్టు వాహ‌న డీల‌ర్ల‌కు అనుమ‌తి ఇచ్చింది. అయితే వాహ‌నాల‌కు అప్ప‌టి వ‌ర‌కు గ‌డువు ఉన్న‌ప్ప‌టికీ బుధ‌వారం నుంచే బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ను దేశ‌వ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ విక్ర‌యిస్తున్నారు. దీంతో వాహ‌నాల నుంచి వెలువ‌డే కాలుష్యం స్థాయిలు ఇంకా త‌గ్గ‌నున్నాయి.

అయితే బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న ఇంధ‌నాన్ని అమ్ముతున్నా.. ఇంధ‌న ధ‌ర‌ల‌ను మాత్రం పెంచ‌లేద‌ని.. క్రూడ్ ఆయిల్ ధ‌ర త‌గ్గినందున ఇంధ‌న ధ‌ర‌ల‌ను పెంచ‌లేద‌ని.. చ‌మురు సంస్థ‌లు తెలిపాయి. ఇక ప్ర‌స్తుతం అమ్ముతున్న ఇంధ‌నంలో స‌ల్ఫ‌ర్ స్థాయిలు కేవ‌లం 10 పీపీఎం వ‌ర‌కు మాత్ర‌మే ఉంటాయని ఆ సంస్థలు తెలిపాయి. కాగా 2010లో భార‌త్ యూరో-3 ప్ర‌మాణాల‌ను అనుస‌రించ‌డం మొద‌లు పెట్టింది. అప్పుడు ఇంధ‌నంలో స‌ల్ఫ‌ర్ స్థాయిలు 350 పీపీఎం వ‌ర‌కు ఉండేవి. ఆ త‌రువాత బీఎస్ 4 ప్ర‌మాణాల‌ను అమ‌లు చేశాక‌.. ఇంధ‌నంలో స‌ల్ఫ‌ర్ స్థాయిలు 50 పీపీఎంకు ప‌డిపోయాయి. ఇక ఇప్పుడు బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న ఇంధ‌నంలో స‌ల్ఫ‌ర్ స్థాయి మ‌రింత ప‌డిపోయి 10 పీపీఎంకు చేరుకుంది. దీంతో బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న ఇంధ‌నం వ‌ల్ల.. వాహ‌నాల నుంచి వెలువ‌డే కాలుష్యం చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని చ‌మురు సంస్థ‌లు వెల్ల‌డించాయి.

అయితే బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న‌ప్ప‌టికీ ఆ ఇంధ‌నాన్ని బీఎస్ 4 వాహ‌నాల్లోనూ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో దేశవ్యాప్తంగా ఉన్న 68,700 పెట్రోల్ పంపుల్లో బుధ‌వారం నుంచి బీఎస్ 6 ప్ర‌మాణాలు ఉన్న పెట్రోల్‌, డీజిల్‌ల‌ను విక్ర‌యించ‌డం ప్రారంభించారు. ఇక ఈ విష‌యంలో భార‌త్ అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేర‌నుంది. ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఈ ప్ర‌మాణాలు ఉన్న ఇంధ‌నాన్ని విక్ర‌యిస్తున్న దేశాలు చాలా త‌క్కువ‌గా ఉన్నాయి. దీంతో ఆ దేశాల స‌ర‌స‌న భార‌త్ చేర‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news