శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం జగన్

-

శరత్ బాబు మరణంపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, సహాయనటుడిగా, అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్ బాబు అని కొనియాడారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమని, శరత్ బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.

CM Y S Jagan Mohan Reddy launches six electronics projects in Andhra  Pradesh | Hyderabad News, The Indian Express

‘తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఆయన మరణవార్త తెలియగానే నటీనటులు, ఇతర రంగాల ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. శరత్ బాబు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news