శ్రీవారి సేవలో పవన్‍

-

పవన్‍ తో పాటు మాజీ స్పీకర్‍

జనసేన అధినేత పవన్‍ కల్యాణ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్‍ నాదెండ్ల మనోహర్‍ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిసేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు, వేదపండితులు వారికి ఆశీర్వచనం ఇచ్చారు. గురువారం కాంగ్రెస్‍ పార్టీకి రాజీనామా చేసిన నాదెండ్ల శుక్రవారం జనసేనలో చేరనున్నారు. తెనాలి శాసన సభస్థానం నుంచి జనసేన తరపున ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‍, నాదెండ్ల మనోహర్‍ ఇరువురు మంచి స్నేహితులు, ఒకే భావజాలం కలవారు కావడంతో జనసైనికులకి మరింత ఉత్సాహం పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news