అఖండ‌లో మూడు పాత్ర‌లు చేయ‌నున్న బాల‌య్య‌..

-

నంద‌మూరి బాల‌కృష్ణ‌త‌న సినిమాల్లో ఒక‌టి కంటే ఎక్కువ పాత్ర‌లు చేసిన నిమాలు అనేకం.ఇందులో చాలా మూవీలు హిట్ అయ్యాయి. బోయ‌పాటితో గ‌తంలో చేసిన లెజెండ్‌ సినిమాలో కూడా రెండు పాత్ర‌లు చేసి సంచ‌ల‌న విజ‌యం సాధించారు. ఇప్పుడు కూడా అలాంటి మ్యాజిక్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మ‌ళ్లీ బోయ‌పాటితోనే ఏకంగా మూడు పాత్ర‌ల్లో న‌టించేందుకు నంద‌మూరి సింహం రెడీ అయిపోతోంది.


కాగా నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వ‌స్తున్న సినిమాకు ‘అఖండ’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను పెట్టి ఫ్యాన్స్‌ను కుషీ చేశారు. ఇక ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌నే వార్త‌ల‌కు ఆయ‌న సన్నిహిత వర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ఇక ఇందులో బాలయ్య అఘోర గెటప్‌లో విలన్‌లను వేటాడే సీన్ అదిరిపోయింద‌నే చెప్పాలి.
మ‌రీ ముఖ్యంగా హర హర మహదేవ్, శంభో శంకర అంటూనే… కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చే పంది అంటూ నంద‌మూరి న‌ట‌సింహం చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ మాస్ ప‌ల్స్‌ని ఇంప్రెస్ చేస్తోంది. ఇందులో ఫ్యాక్షనిస్ట్‌గా, కలెక్టర్‌గా.. అఘోరగా మూడు ఒక దానికి, మ‌రొక దానికి సంబంధం లేని పాత్ర‌లు చేయ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇక ఈ మూవీని ప‌వ‌ర్‌ఫుల్ గా తీస్తున్నార‌ని చెప్ప‌క‌నే చెప్తున్నారు. బాల‌య్య చెప్పిన డైలాగ్‌తో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుంద‌నే విష‌యాన్ని బోయ‌పాటి చెప్ప‌క‌నే చెప్పాడ‌ని తెలుస్తోంది. ఈ సిన‌మాపై అభిమానులు బాగానే అంచ‌నాలు పెట్టుకున్నారు. మ‌రి బోయ‌పాటి అభిమానుల అంచ‌నాల‌ను రీచ్ అవుతాడా లేదా విష‌యం తేలాలంటే సినిమా విడుద‌ల‌య్యేదాకా వేచిచూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news