ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా ఆమ్రపాలి

-

జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ ఆమ్రపాలిని రాష్ట్ర ఎన్నికల సంయుక్త ప్రధాన అధికారిగా నియమించారు.  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం పంపిన కొంత మంది పేర్లలో ఆమ్రపాలి పేరుని ఎన్నికల సంఘం ఆమోదించింది. ఎన్నికల నిర్వహణలో ఐటీ వినియోగానికి సంబంధించిన అంశాలను ఆమ్రపాలి పర్యవేక్షించనున్నారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ఇటీవలే జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఓట్ల నమోదు, ఓటర్ల జాబితా ..ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలను ఆమ్రపాలి పరిశీలించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news