ఏపీ సీఎస్ కు చంద్రబాబు లేఖ… అసలు విషయం ఇదే !

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో గెలవాలన్న ఆకాంక్షతో శ్రమిస్తున్నారు. కాగా తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది. ఇటీవల అకాల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వర్షాల వలన కొంతమేరకు రైతులకు పంట నష్టం జరిగింది. కొన్ని పంటలు అస్సలు పనికిరాకుండా నాశన అవ్వగా, కొన్ని పంటలు మాత్రమే రంగు మారిపోయాయి.

ఈ పంటల నష్టం మీద సమగ్రమైన విశ్లేషణ జరిపి రంగు మారిపోయిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ లేఖలో పేర్కొన్నారు. కాగా ఈ వర్షాల వలన మరణించిన ప్రతి రైతు కుటుంబానికి రూ. 25 లక్షల నష్టపరిహారంగా చెల్లించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news