క్యా సీన్ హై: రాజకీయ పొత్తుకోసమే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో భేటీ !

-

ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైద్రాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో అతనిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరూ చాలాసేపు ప్రస్తుతం రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో ఉన్న సమస్యలు మరియు వైసీపీ పాలన గురించి సైతం చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇలా ఇరువురు కలవడం మూడవ సారి కావడం గమనార్హం. ఈ మధ్య ఎర్రగొండపాలెంలో జరిగిన ఘటన గురించి కూడా వీరిద్దరూ మాట్లాడుకున్నారు. మరి ఈ భేటీపై అప్పుడే పలు రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలో ఏపీలో ఎన్నికలు ఉండడం వలన వీరిద్దరి భేటీ చర్చనీయాంశం అయింది. పొత్తుల గురించి ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది, మరి పవన్ కళ్యాణ్ కు పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ వచ్చిందా లేదా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news