ఢిల్లీలో ‘మెగా మందిర్ మార్చ్’.. ర్యాలీ..

-

ఢిల్లీలో ‘మెగా మందిర్ మార్చ్’.. ర్యాలీ..

ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో విశ్వ‌హిందూప‌రిష‌త్ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ‘మెగా మందిర్ మార్చ్‌’ ర్యాలీని ఆదివారం చేప‌ట్టారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు భ‌య్యాజీ జోషి మాట్లాడుతూ.. అయోధ్య‌లో రామమందిర నిర్మాణం వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. పార్లమెంట్ శీతాకాల స‌మావేశాల్లో  ఈమేర‌కు బిల్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని, లేక‌పోతే దేశ‌వ్యాప్తంగా త‌మ ఆందోళ‌న‌లు మ‌రింత ఉధృతం చేస్తామ‌ని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఆయోధ్య మందిరం పై  వెంటనే నిర్ణయం తీసుకుని ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news