తొలిసారిగా పార్లమెంట్ లో 92 మంది ఎంపీల సస్పెన్షన్….. ఎందుకంటే

-

పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఉభయ సభలనుంచి 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ విషయాన్ని ఉభయ సభల సభాపతులు వెల్లడించారు. సభా కార్యక్రమాలకు అడ్డుపడడం ,క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం, సభా నియమాలు ఉల్లంఘించడం మూలంగా సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల జరిగిన పార్లమెంట్ భద్రత సంఘటన పై హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వీరిపై ఈ వేటు కొనసాగనుంది. ఇంతకుముందు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 63 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు వేయగా ఇప్పుడు ఏకంగా 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.

 

సోమవారం రోజు లోక్సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీలు :అధిర్ రంజన్ చౌదరితో పాటు కే.జై కుమార్, అపూర్వ పొద్దార్, అబ్దుల్ ఖలీద్, సు.తిరునావుక్కరసర్, విజయ్ బసంత్, ప్రతిమ మండల్, కాకోలి ఘోష్, కే.మురళీధరన్, సునీల్ కుమార్ మండల్, ఎస్.రామ లింగం, కే.సురేష్, అమర్ సింగ్, రాజ్మోహన్ ఉన్నితన్, గౌరవ్ ,ప్రసూన్ బెనర్జీ, మహమ్మద్ వాసిర్, జీ.సెల్వం, సీఎన్ అన్నాదురై, డాక్టర్ టీ.సుమతి, కే.నవాస్కాని, కే.వీరాస్వామి, ఎన్‌కే.ప్రేమచంద్రన్, సౌగత రాయ్, శతాబ్ది రాయ్, అసిత్ కుమార్ మల్, ఎన్టు ఆంటోనీ, ఎస్.ఎస్.పళనామ్నిక్కం, టి ఆర్ బాలు సస్పెండ్ అయ్యారు.

అలాగే రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన వారు:ఎం.సంగమ్, అమీ యాగ్నిక్, ఫూలో దేవి నేతమ్, మౌసమ్ నూర్ ,నారాయణ్ భాయ్ జెత్వా, రంజిత్ రంజన్, రణదీప్ సూర్జేవాలా, రజనీ పాటిల్,సమీరుల్ ఇస్లాం, కనిమొళి, ఫయాజ్ అహ్మద్, అజిత్ కుమార్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news